Header Banner

సురానా గ్రూప్ స్కాంలో పెద్ద షాక్! మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. దర్యాప్తు మొదలు!

  Sun Apr 27, 2025 21:22        Cinemas

ఈడీ అధికారులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌తో పాటు ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సాయి సూర్య, సురానా కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసుల ప్రకారం మహేష్ బాబు రేపు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈడీ అధికారులకు ఓ విజ్ణప్తి చేశారు. సినిమా షూటింగ్ కారణంగా తాను రేపు( సోమవారం) విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీ అధికారులకు ఓ మెయిల్ ద్వారా విజ్ణప్తి చేశారు. ఈడీ అధికారులు మహేష్ బాబు విజ్ణప్తిని పరిగణలోకి తీసుకుని సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి: జీవీఎంసీ మేయర్ ఎన్నికలలో సంచలనం! టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఆయన ఖరారు!


ఇంతకీ ఏంటీ కేసు..
వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో రియల్‌ఎస్టేట్‌ సంస్థ సురానా గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్‌, ఆర్యవన్‌ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌తో పాటు ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర ఇంట్లో కూడా సోదాలు చేశారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా గ్రూపు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సురానా అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.


యాడ్స్ విషయంలో మహేష్‌కు నోటీసులు


ప్రమోషన్స్ కింద సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల నుండి మహేష్ బాబు పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా.. మొత్తం రూ. 5.9 కోట్లు తీసుకున్నారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మహేష్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఏప్రిల్ 28వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాలు! కీలక పత్రాలు స్వాధీనం! వేల కోట్ల అవినీతి గుట్టురట్టు!

 

చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ కళాశాలల్లో కొత్త నియామకాలు!

 

 వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!

 

కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

 

పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!

 

గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..

 

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SuranaGroupScam #MaheshBabu #EDInvestigation #MoneyLaundering #AndhraPradesh #Tollywood #BreakingNews #CelebrityNews